జనాభా నియంత్రణ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్

ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్. జనాభాను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పదంటున్నారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 377ను రద్దు చేయాలన్నారు. జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని యోగా గురువు బాబా రామ్దేవ్ సూచించారు. హరిద్వార్లో మే 27వ తేదీ సోమవారం మీడియాతో మాట్లాడారు.
వచ్చే 50 ఏళ్లలో భారత జనాభా 150 కోట్లు దాటరాదన్నారు. అంతకు మించి జనాభా పెరిగితే ప్రభుత్వాలు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించలేవని అభిప్రాయపడ్డారు. 🔴ఆయన సూచించిన కఠిన చర్యలు: ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టం తీసుకురావాలన్న ఆయన మూడో బిడ్డ పుడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడో బిడ్డకు ఓటు హక్కు కల్పించకుండా ఉండటంతో పాటు..వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలన్నారు రామ్దేవ్. మతంతో సంబంధం లేకుండా సంతానం విషయంలో ప్రతి ఒక్కరూ నియంత్రణ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.అధిక సంతతి కోసం ఆశ పడే వారు ఈ వ్యాఖ్యలకు..మండి పడుతున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
