ఒక కాకి 18 రైళ్లను ఆపేసింది…!!?

Untitled design (28)

కొన్ని సార్లు చిన్న సంఘటనలు పెద్ద ప్రభావంను చూపుతాయని చెప్పడంలో అతి శయోక్తి లేదు.
తాజాగా ఒక కాకి చేసిన పనికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 రైళ్లు నిలిచి పోయాయి. ఇలాంటి సంఘటనలు మరెక్కడో జరిగితే ఏమో అనుకునే వాళ్లం. 👉కాని ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థ ఉన్న ఇండియాలో ఈ సంఘటన జరిగింది.

లక్షలాది మంది ప్రయాణికులు, వేలాది మంది ఉద్యోగులు పని చేసే రైళ్లు నిలిచిపోవడంకు కారణం ఒక కాకి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ముంబయిలో గత శనివారం ఉదయం నుండి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు, పలు రైళ్లు రూటు మార్చుతున్నట్లుగా రైల్వే అధికారులు హడావుడిగా ప్రకటన విడుదల చేయడం జరుగుతుంది. కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు చేస్తున్నాం.

కొంత సమయం వరకు వేచి చూడాలి అంటూ అధికారులు రైల్వే ప్రయాణికులకు తెలియజేయడం జరిగింది. బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

కొన్ని గంటల పాటు రైల్వే అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఎక్కడైనా రైలు ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.
👉అసలు ఏం జరిగింది అంటే :
రైల్వే హైటెన్షన్‌ కేబుల్స్‌ పై ఒక కాకి చనిపోయింది.

కాని చనిపోయిన సమయంలో హైటెన్షన్‌ వైర్లతో షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యింది. ఇన్సులేటర్‌ ద్వారా అటాచ్‌ అయిన వైర్ల కారణంగా వైర్లు కాలి బూడిద అయ్యాయి.

దాంతో వాటిని పునరుద్దీంచేందుకు రైల్వే అధికారులకు చాలా సమయం పట్టింది. ఆ సమయంలో అటుగా వెళ్లాల్సిన రైల్లు చాలా వరకు రద్దు అయ్యాయి.

కొన్ని రూటు మార్చారు. మొత్తానికి ఒక కాకి వల్ల శనివారం లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

వందలాది మంది రైల్వే ఉద్యోగులు నానా హైరానా పడ్డారు. అందుకే దేని అంత తేలికగా తీసివేయకూడదు అంటారు.అంతే కదా చిన్న అగ్గి పుల్లే కదా పెద్దదైన అడివిని తగలబెట్టేది.so ..🔴be aware about small things..


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights