ఎన్నికల ఫలితాల విడుదల మరింత లేట్..

మే 23!! వచ్చేస్తుంది. ఎన్నికల మహాసంగ్రామంలో విజేతలెవరో ,పరాజితులెవరో…ఆ రోజు తేలిపోతుంది. ఇది వరకు కౌంటింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే ఫలితాలు తెలిసిపోయేవి! కానీ ఇప్పుడు పరిస్థితి ఆలా లేదు. 👉లెక్కింపు సమయం పెరగనుంది : ఈసారి అభ్యర్థులు ఊపిరి బిగపట్టి మరింత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి!! నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్(వోటర్ వెరిఫియబుల్ పేపర్ ట్రయల్)లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. కౌంటింగ్ సమయం పెరగనుంది. ఒక్కో వీవీప్యాట్లోని స్లిప్పులను లెక్కించేందుకు సుమారు గంట సేపు పట్టొచ్చని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం ఫలితాలు అధికారికంగా విడుదల చేయడానికి కనీసం నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గంటలే పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వీవీప్యాట్లోని స్లిప్పుల లెక్కలో వచ్చిన ఓట్ల సంఖ్య, ఈవీఎంలోని ఓట్ల సంఖ్య సరిపోతే ఫలితాలు వెంటనే వెల్లడిస్తారు. లేనిపక్షంలో రెండూ సరిపోయేవరకూ రీకౌంటింగ్ నిర్వహిస్తారు. 👉ఇంకా తేడా అనిపిస్తే : వీవీప్యాట్లోని మొత్తం స్లిప్పుల లెక్కనే పరిగణనలోకి తీసుకుంటారు. 👉ఏది ఏమైనా vv ఫ్యాట్లు ఇంకా ఈవీమ్ మెషిన్ వల్ల ఓట్ల లెక్కింపు ,ఫలితాలు మరింత లేట్ అవుతున్నాయి.ఉత్కంఠ మరింత పెరగబోతుంది..
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
