సంచలనం సృష్టిస్తున్న EXit పోల్స్ ఫలితాలు : Ap సీ.ఎం ఎవరో తెలిసిపోయింది

సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) వారి Exit poll సర్వే ప్రకారం : .ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఏపీలో ప్రతిపక్ష వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేసింది.
👉అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 130 నుంచి 133 సీట్లు వస్తాయని వెల్లడించింది. 21 లోక్ సభ స్థానాల్లో ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. టీడీపీకి 43 నుంచి 44 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెబుతోంది. టీడీపీకి కేవలం నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. జనసేనకు ఒక్క అసెంబ్లీ స్థానం మాత్రమే దక్కుతుందని సర్వే వివరాలు వెల్లడించింది.
👉ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి :. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.04 శాతం, టీడీపీకి 41.2శాతం, జనసేనకు 7.03శాతం ఓట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. ♦వైసీపీ, టీడీపీ మధ్య 8 శాతం ఓట్ల తేడా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
