మే 25 నుంచి ‘విమానయానం’ మొదలు

*మే 25 నుంచి ‘విమానయానం’ మొదలు* *దశల వారీగా సేవల పునరుద్ధరణ: హర్దీప్సింగ్ పూరీ* దిల్లీ: దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల 25 నుంచి దశల వారీగా సేవలు మొదలవుతాయని పౌర విమానయాన శాఖా మంత్రి హర్దీప్సింగ్ పూరీ వెల్లడించారు. ఇప్పటికే విమానయాన సంస్థలు, ఎయిర్పోర్టులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. కరోనా వైరస్ ముప్పుతో మార్చి చివర్లో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కాలంలో సరకు రవాణా, కొన్ని ప్రత్యేక సేవల విమానాలు మాత్రం నడిచాయి. ‘2020, మే 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ఆరంభమవుతాయి. దశల వారీగా సేవలు పుంజుకుంటాయి. అన్ని విమానాశ్రయాలు, సంస్థలకు సమాచారం అందించాం. సిద్ధంగా ఉండాలని సూచించాం. ప్రయాణికుల కదలికలు, జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా విడుదల చేస్తుంది’ అని హర్దీప్సింగ్ ట్వీట్ చేశారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
