స్కానింగ్ సెంటర్ లో జరిగిన సంఘటన..

Teluguwonders: ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ జిల్లా మహిళా ఆసుపత్రిలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. డెలివరీ సందర్భంగా ఒక్క శిశువు మాత్రమే జన్మించడంతో సంబంధిత కుటుంబ సభ్యులు నానాహడావుడి చేశారు. మహిళ గర్భంలో కవలలు ఉన్నారంటూ వారు వైద్యులకు అల్ట్రాసౌండ్ రిపోర్టు చూపించారు. అయితే మహిళా ఆసుపత్రి వర్గాలు దీన్ దయాళ్ ఆసుపత్రి నుంచి వచ్చిన అల్ట్రా సౌండ్ రిపోర్ట్పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా డెలివరీ జరిగిన మహిళ కుటుంబ సభ్యులు ఒక శిశువును ఆసుపత్రి సిబ్బంది అపహరించారని ఆరోపిస్తున్నారు. చివరికి ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకూ చేరింది.
👉వివరాల్లోకి వెళితే : క్వాసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవత్పూర్ ప్రథా నివాసి సత్యేంద్ర కుమార్ తన భార్య సంగీతకు డెలివరీ చేయించేందుకు జిల్లా మహిళా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెకు డెలివరీ జరగగా, ఒక మగబిడ్డ జన్మించాడు. దీంతో భర్త షాక్ అయ్యాడు
🔴మరి రెండో శిశువు ఎక్కడ !!? : దీంతో సత్యేంద్ర తాము అల్ట్రాస్కానింగ్ చేయించినపుడు కవలలు ఉన్నట్టు తెలిసిందని,మరి మరో శిశువు ఎక్కడని ఆసుపత్రి సిబ్బందిని నిలదీశాడు. ఆ రిపోర్టును వారికి చూపించాడు. తరువాత వారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
👉కాగా ఈ ఉదంతంపై ఆసుపత్రి వైద్యాధికారి గీతా ప్రధాన్ మాట్లాడుతూ ఆ మహిళకు దీనదయాళ్ ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించారన్నారు. అయితే తమ ఆసుపత్రిలో ఆ మహిళ ఒక్క శిశువుకు మాత్రమే జన్మనిచ్చిందని వివరించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
