Ind vs Pak : సామాన్యుడికి కాదు.. శ్రీమంతులకు మాత్రమే ఈ మ్యాచ్..భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు అందుకే అమ్ముడుపోలేదా?

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు ఇంకా అమ్ముడుపోలేదు. రాజకీయ సంబంధాల వల్ల ఈ మ్యాచ్లు కేవలం పెద్ద టోర్నమెంట్లలో మాత్రమే జరుగుతాయి. కాబట్టి, ఎప్పుడూ స్టేడియాలు కిటకిటలాడుతూ ఉంటాయి. కానీ, సెప్టెంబర్ 14న జరగబోయే ఏషియా కప్ 2025 హై-వోల్టేజ్ మ్యాచ్కు టికెట్ల అమ్మకాలు నిదానంగా సాగుతున్నాయి.
టికెట్లు ఎందుకు అమ్ముడుపోలేదు?
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు ఇంకా పూర్తిగా అమ్ముడుపోలేదు. దీనికి కారణం టికెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉండటమే. సామాన్య ప్రేక్షకులు ఈ ధరలను భరించలేకపోతున్నారు. కొన్ని టికెటింగ్ పోర్టల్స్లో వీఐపీ సూట్ ఈస్ట్ టికెట్ల ధర రెండు సీట్లకు 2.5 లక్షల రూపాయలుగా ఉంది. ఇందులో అన్లిమిటెడ్ ఫుడ్, డ్రింక్స్, వీఐపీ క్లబ్, లాంజ్ ఎంట్రీ, ప్రైవేట్ ఎంట్రన్స్, పార్కింగ్ పాస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
అదే విధంగా.. రాయల్ బాక్స్ ధర సుమారు 2.3 లక్షల రూపాయలు, స్కై బాక్స్ ధర 1.6 లక్షలు, ప్లాటినం టికెట్ ధర సుమారు 75,000 రూపాయలుగా ఉంది. అయితే, అత్యంత చౌకైన టికెట్లు ఇద్దరు వ్యక్తులకు 10,000 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి.
అభిమానుల కోపం
సాధారణంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు కొన్ని గంటల్లోనే అమ్ముడుపోతాయి. కానీ, ఈసారి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో తమ కోపాన్ని వ్యక్తం చేస్తూ, నిర్వాహకులు ధరలు పెంచడం వల్ల సాధారణ క్రికెట్ అభిమానులు స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు.
చారిత్రక మ్యాచ్
భారత్, పాకిస్థాన్ జట్లు చాలా సంవత్సరాల నుండి ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదు. అందుకే రెండు దేశాల అభిమానులకు ఆసియా కప్, ఐసీసీ టోర్నమెంట్లు మాత్రమే తమ జట్లను చూసే అవకాశం. అందుకే ఈ మ్యాచ్పై ఎల్లప్పుడూ భారీ ఉత్సాహం ఉంటుంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
