ముంబైలో రికార్డ్ చేజ్.. గెలిచే వరకు ఆపొద్దు అన్న గంభీర్..14 ఏళ్ల హిస్టరీ రిపీట్ చేసిన జెమీమా

india-vs-australia-1-1

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు రికార్డు విజయం సాధించిన తర్వాత, దేశం నలుమూలల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చారిత్రక విజయంపై ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు.

Jemimah Rodrigues : మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు రికార్డు విజయం సాధించిన తర్వాత, దేశం నలుమూలల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చారిత్రక విజయంపై ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. నవీ ముంబైలో జరిగిన ఈ అద్భుతమైన విజయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఈ మ్యాచ్ స్టార్ బ్యాటర్ జెమీమా ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ 14 ఏళ్ల క్రితం 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో ముంబైలోనే గౌతమ్ గంభీర్ ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తు చేసింది.

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, నేరుగా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ అద్భుత విజయాన్ని భారత పురుషుల జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేకంగా అభినందించారు. గంభీర్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఆట ముగిసే వరకు దాన్ని ముగిసినట్లుగా భావించవద్దు. అద్భుతమైన ఆట ఆడారు అమ్మాయిలూ అని పోస్ట్ చేశారు. ఈ మెసేజ్‎లోని భావం ప్రముఖ బాలీవుడ్ చిత్రం మాంఝీ – ది మౌంటైన్ మ్యాన్ లోని గెలిచే వరకు ఆపొద్దు అనే డైలాగ్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంది.

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో భారత మహిళల జట్టు చారిత్రక ఘనతను నమోదు చేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని భారత్ ఛేదించడం ద్వారా రికార్డు సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో 339 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి. భారత్ ఈ అద్భుత విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం జెమీమా రోడ్రిగ్స్. నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జెమీమా, చివరి వరకు క్రీజులో నిలబడి, జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆమె 134 బంతుల్లో 127 పరుగులతో అజేయంగా నిలిచింది.

జెమీమా రోడ్రిగ్స్ అసాధారణ సెమీఫైనల్ ఇన్నింగ్స్, 14 ఏళ్ల క్రితం 2011 పురుషుల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ముంబైలోనే గౌతమ్ గంభీర్ ఆడిన కీలక ఇన్నింగ్స్‌ను గుర్తు చేసింది. జెమీమా (127*), గంభీర్ (97) ఇద్దరూ నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు దిగారు. ఇద్దరూ తమ చారిత్రక ఇన్నింగ్స్‌లను ముంబై మైదానాల్లోనే ఆడారు. జెమీమా డీవై పాటిల్ స్టేడియంలో ఆడగా గంభీర్ వాంఖడే స్టేడియంలో ఆడారు. జెమీమాది ప్రపంచ కప్ సెమీఫైనల్ కాగా, గంభీర్ ఇన్నింగ్స్ ప్రపంచ కప్ ఫైనల్ లో జట్టును గెలిపించింది. ఈ రెండు ఇన్నింగ్స్‌ల తర్వాత ఇద్దరి జెర్సీలపైనా మట్టి మరకలు కనిపించాయి. క్రికెట్ భాషలో ఈ మరకలు మంచివి అని చెబుతారు. ఈ విధంగా జెమీమా ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ గంభీర్ 2011 ఫైనల్ ఇన్నింగ్స్ స్ఫూర్తిని, పోరాట పటిమను తిరిగి కళ్ళ ముందు నిలబెట్టింది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights