ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే “ఒక” సంచలన నిర్ణయం ప్రకటించబోతున్న జగన్…

jagan

ఎప్పుడూ తన ఆలోచనలతో సరికొత్త ఒరవడికి తెరలేపె జగన్ ముఖ్యమంత్రిగా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టించబోతున్నారు.

👉విషయం లోకి వెళ్తే :ఏపీలో గత నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ నెల ఇరవై మూడున ఈ ఫలితాలు కూడా వెలువడునున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామంటే .. తాము గెలుస్తామని ఇటు అధికార టీడీపీ నేతలు.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు ధీమాగా ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలలో తేలింది.సాక్షాత్తు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు సోంతంగా నిర్వహించిన పలు సర్వేలలో కూడా వైసీపీ గెలుస్తుందని తేలింది. ఇక ఈ నెల ఇరవై మూడు తర్వాతవైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకటే బాకీ.

♦ ప్రమాణ స్వీకారం చేసిన రోజే సంచలన నిర్ణయం తీసుకోబోతున్న జగన్ : అదేంటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి తీసుకుంటున్న జీతం తీసుకోకుండా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారట.ఈ నిర్ణయంతో ప్రభుత్వ అధికారులు ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా చక్కగా పని చేయాలి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పని అయిన సరే రూపాయి లంచం కూడా తీసుకోకుండా చేయాలని అధికారులకు మంచి సందేశం ఆ రోజే ఇవ్వడానికి జగన్ ప్రణాళికలు సిద్ధం చేశారు అట. జగన్ ముఖ్యమంత్రిగా రూపాయి మాత్రమే జీతం తీసుకుని చరిత్రలో నిలిచిపోతారని ఆలోచిస్తున్నారని వైసీపీ ముఖ్య శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights