Kurnool Bus Accident: ప్రాణాలు హరించిన ప్రయాణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Kurnool Bus Fire: కర్నూలు జిల్లాలో జరిగన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వీరంగా నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలుగా తెలుస్తోంది.
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన తల్లిదండ్రుల సహా ఇద్దరు పిల్లలు కూడా మరణించారు. మృతులు వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేశ్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12)గా పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే వారికి బంధువులుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు.. కర్నూలు జిల్లా సమీపంలోకి రాగానే అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో ఆ మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా మరో 21 మంది గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిలో 11 మంది ఆచూకీ లభించగా మరో 9 మంది వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
