23 న నా సర్వే తప్పితే ఇక సర్వే లు చెప్పను :లగడపాటి రాజగోపాల్

లగడపాటి రాజగోపాల్ తాజాగా ఏపీ ఎన్నికలపై ఆక్టోపస్ సర్వే ఫలితాలు వెల్లడించారు. ఏపీలో సైకిల్కు తిరుగులేదని.. కచ్చితంగా టీడీపీ గెలిచి తీరుతుందని లగడపాటి తేల్చేశారు. సర్వే ఫలితాలు వెల్లడించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చారు.
🎙మీడియా ప్రశ్న : ఏపీ ఎన్నికల్లో మీ సర్వే ప్లాప్ అయితే పరిస్థితేంటి..!? అని అడగగానే
👉🎙లగడపాటి :“ఈ సారి నా సర్వే అంచనాలు తప్పితే మళ్లీ సర్వే చేసి చెప్పను. ఈ నెల 23 తర్వాత నా విశ్వసనీయత పెరుగుతుంది. నా సర్వేను నమ్మాలని నేను ఎవరినీ కోరడంలేదు. బల్లగుద్ది అస్సలే చెప్పట్లేదు. కత్తిపెట్టి ఇది వినండని నేనేం అనలేదు. వినేవాళ్లు వింటారు. నమ్మేవాళ్లు నమ్ముతారు. నా వాయిస్ వెళ్లింది. నాకు అటు ఏపీ.. ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీతో సంబంధంలేదు. నా రాజకీయ ప్రయాణం కాంగ్రెస్తోనే మొదలైందన్న విషయం మీ అందరికీ తెలుసు. అదే కాంగ్రెస్ పార్టీనే నా రాజకీయ జీవితం అంతమైంది. నాకు ఏ పార్టీ ఎక్కువ కాదు.. ఏ పార్టీ తక్కువ కాదు.. అన్ని పార్టీలూ నాకు సమానమే. దయచేసి నన్ను ఏ పార్టీతోనూ ముడిపెట్టొద్దు. స్వతంత్రంగానే నేను ఉండదలుచుకుంటున్నాను” అని లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
👉లగడపాటి రాజగోపాల్ నమ్మకం :
ఈ సారి తన సర్వే కచ్చితంగా సక్సెస్ అవుతుందని లగడపాటి మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే లగడపాటితో మరో రెండు మూడు సర్వే సంస్థలు సైతం టీడీపీ దేఅధికారమని తేల్చి చెప్పేశాయి. కానీ కొన్ని కారణాల వల్ల లగడపాటి పై నమ్మకం తగ్గింది : 👉లగడపాటి పై నమ్మకం తగ్గదానికి గల కారణం : గతం లో తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే అట్టర్ ప్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సర్వే ప్లాప్ అవ్వడంతో రాజగోపాల్పై ఉన్న విశ్వసనీయత చాలా తగ్గిందని విశ్లేషకులు, క్రిటిక్స్ అప్పట్లో పెద్ద హడావుడే చేశారు. మరి ఇప్పుడు లగడపాటి జోస్యం ఏమవుతుందో తెలియాలంటే మే-23 వరకు వెయిట్ చేయాల్సిందే మరి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
