కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గ్రామ వాలంటీర్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాల్లో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. తహసీల్దార్ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడటంతోనే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణానికి చెందిన గ్రామ వాలంటీర్ షేక్ జుబేద (20) బలవన్మరణానికి పాల్పడింది. కంప్యూటర్ ఆపరేటర్ మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన ఆమె తన ఇంట్లోని బాత్రూమ్లో ఉన్న ఇనుప రాడ్కు చున్నీతో ఉరేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ గుంటూరి శివప్రసాద్చారి అవమానకరంగా మాట్లాడటం వల్లే తమ కుమార్తె ఉరేసుకుందని మృతురాలి తల్లి కరీమున్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
శుక్రవారం రాత్రి తమ ఇంటికి వచ్చిన శివప్రసాద్చారి.. రికార్డులన్నీ పూర్తి చేసి శనివారం ఉదయానికి ఎంఆర్ఓ ఆఫీసుకు తీసుకురావాలని హెచ్చరించారని వివరించింది. అంతేకాదు, సక్రమంగా పనిచేయడం లేదని, ఇలా అయితే ఉద్యోగం నుంచి తీసేస్తారని కటువుగా మాట్లాడారని తెలిపింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జుబేద శనివారం ఉదయం బాత్రూమ్ పైనున్న ఇనుపరాడ్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని కరీమున్ చెప్పారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం శివప్రసాద్చారి పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆపై పరుష పదజాలతో దూషించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయి జరిగిన విషయం తండ్రి శ్రీరామమూర్తికి తెలిపింది. ఆయన వారించి పొలం పనులకు వెళ్లిపోయారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన నవీన ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.