రాంచీ టెస్టులో ఉమేశ్ యాదవ్ ఐదు సిక్సర్లు 6,6,0,1,6,0,6,0,6
రాంచీ టెస్టులో క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లతో విరుచుకుపడిన ఉమేశ్ యాదవ్.. 10 బంతుల వ్యవధిలోనే ఏకంగా 5 సిక్సర్లు బాదేశాడు. అతని జోరుకి టెస్టుల్లో అరుదైన రికార్డ్లు బ్రేకయ్యాయి.
- రాంచీ టెస్టులో ఐదు సిక్సర్లు బాదేసిన ఉమేశ్ యాదవ్
- టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా రికార్డ్
- మ్యాచ్లో ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్నీ సిక్సర్లుగా మలిచిన రెండో భారత బ్యాట్స్మెన్
- తొలి బంతినే సిక్సర్గా బాదిన నాలుగో భారత ఆటగాడు
దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత టెయిలెండర్ బ్యాట్స్మెన్ ఉమేశ్ యాదవ్ 5 సిక్సర్లతో సరికొత్త రికార్డ్ల్ని నెలకొల్పాడు. మ్యాచ్లో రెండో రోజైన ఆదివారం రెండో సెషన్లో బ్యాటింగ్కి వచ్చిన ఉమేశ్ యాదవ్ (31: 10 బంతుల్లో 5×6) రెండు ఓవర్ల వ్యవధిలోనే ఏకంగా 5 సిక్సర్లు బాదేశాడు. స్పిన్నర్ జార్జ్ లిండే బౌలింగ్ని లక్ష్యంగా చేసుకున్న ఉమేశ్.. అన్ని సిక్సర్లూ అతడికే కొట్టి.. వికెట్ కూడా సమర్పించుకున్నాడు. ఈ టెస్టులో డబుల్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ 255 బంతులాడి 6 సిక్సర్లు బాదగా.. ఉమేశ్ యాదవ్ కేవలం 10 బంతుల్లో 5 సిక్సర్లు నమోదు చేయడం కొసమెరుపు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.