పెరిగిన పాల ధరలు

Teluguwonders: పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రిగాబాధ్యతలు స్వీకరించిన మోపిదేవి వెంటకరమణ పాడి రైతులకు ఉపయోగపడే విధంగా పాల ధరను పెంచామని ఒక సంచలన ప్రకటన చేశారు.
🔴మోపిదేవి వెంకట రమణారావు : నిజాంపట్నానికి చెందిన మోపిదేవి వీరరాఘవయ్య, నాగులమ్మ కుమారుడైన మోపిదేవి వెంకట రమణరావు అతిసామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యనభ్యసిస్తూ నాయకత్వ లక్షణాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ ఎంపీ సింగం బసవపున్నయ్య ప్రోద్బలంతో 1987లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీపీగా పోటీ చేసి విజయం సాధించి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎంపీపీ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వెంకటరమణ..వైఎస్కు విధేయుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
బీసీ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు.
🐄పాల ధర పెంపు: మంత్రి మాట్లాడుతు..పాడి రైతుల కోసం పాల ధరను పెంచుతున్నామనీ..లీటరు పాలకు రూ.4 పెంచుతున్నామని తెలిపారు.
రూ.4లు పెంచటంతో ప్రభుత్వంపై రూ.220 కోట్ల అదనపు భారం పడుతుందనీ..అయినా రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ పెంపుతో 9 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. పాడి పరిశ్రమ, మత్స్య శాఖ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
