ఆపరేషన్ ముస్కాన్తో అండ

*ఆపరేషన్ ముస్కాన్తో అండ* *తల్లిదండ్రుల చెంతకు 4,703 మంది బాలలు*
*ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడి* అమరావతి: వందల మంది వీధి బాలలు, అనాథలు, హోటళ్లు, దుకాణాలు, పరిశ్రమల్లో పని చేస్తున్న బాల కార్మికులను ‘‘ఆపరేషన్ ముస్కాన్ కొవిడ్-19’’లో భాగంగా పోలీసుశాఖ సంరక్షించింది.
ఈనెల 14-20 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంతో లభించిన ఫలితాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం వెల్లడించారు. సంరక్షించిన వారిలో కొంతమంది బాలలతో పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ మాట్లాడారు.
కార్యక్రమంలో సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్కుమార్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్.అనూరాధ, కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్ రేఖారాణి పాల్గొన్నారు.
డీజీపీ మాట్లాడుతూ.. ‘‘వారం రోజుల వ్యవధిలో 4,806 మందిని సంరక్షించాం. వారిలో 4,703 మందిని తల్లిదండ్రులకు అప్పగించాం. మిగతా 103 మందిని సంరక్షణ గృహాల్లో చేర్పించామ’ని తెలిపారు.
*సినిమా నటి కావాలనేది ఆ బాలిక కోరిక.* ఇదే విషయాన్ని ఇంట్లో పదేపదే చెప్పేది. పెద్దలు ఎంత సర్దిచెప్పినా విన్లేదు. చెప్పాపెట్టకుండా హైదరాబాద్కు వెళ్లిపోయేందుకు విజయనగరం జిల్లా బొబ్బిలి బస్టాండుకు చేరుకుంది. ఎటెళ్లాలో తెలియక రాత్రంతా బస్టాండులోనే గడిపింది. గమనించిన పోలీసులు వివరాలు ఆరా తీసి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. నాలుగేళ్ల కిందట పాలకొల్లులోని తన ఇంటి నుంచి ఓ పదేళ్ల బాలుడు పారిపోయాడు. విజయవాడలో ఆ బాలుడ్ని గుర్తించిన పోలీసులు సంరక్షించి అతని తల్లికి అప్పగించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
