రొచ్చులో.. రోడ్లు!

road_issue

రొచ్చులో.. రోడ్లు!

చిన్నపాటి వర్షానికే తటాకాలను తలపిస్తున్న పుర వీధులు.

రూ.32 కోట్లు ఖర్చు చేసినా మారని రహదారుల దుస్థితి

అవస్థలు పడుతున్న మంగళగిరి పట్టణ ప్రజలు

నిర్లక్ష్యం వీడని అధికారులు, పాలకులు.

మంగళగిరి:
*రాజధాని ప్రాంత ప్రధాన పట్టణం మంగళగిరిలో ప్రధాన రోడ్లు సైతం దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాత బస్టాండ్‌ ప్రధాన కూడలి, జామియా మసీదు రోడ్డు, దేవస్థానం రోడ్డు మంగళవారం కురిసిన చిన్నపాటి వర్షానికే జలమయమయ్యాయి. అస్తవ్యస్థ డ్రైనేజీ నిర్మాణాల కారణంగా వర్షపు నీరు,మురుగునీరు కలసి ముందుకు వెళ్లక నిలిచిపోవడంతో పట్టణప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రోడ్డు కూడళ్ళు కావడంతో వాహనదారులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు కిందపడ్డ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక పట్టణంలోని పలు కాలనీలలో అంతర్గత రోడ్లలో వర్షపు నీరు,మురుగునీరు నిలిచి ముక్కు పుటాలదిరే దుర్గంధం వెదజల్లుతోంది. రానున్న వర్షాకాలంలో రాత్రిపూట రోడ్ల పై వెళ్లాలంటే ఏమి జరుగుతుందోనని పట్టణ ప్రజలు,వాహనదారులు భయపడుతున్నారు. గతంలో రూ.32 కోట్లతో సీసీ డ్రైనేజిలు నిర్మించినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని పలువురు ప్రజలు వాపోతున్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights