ఆర్టీసీ ఆదాయానికి గండి….జేబులు నింపుకొంటున్న తాత్కాలిక కండక్టర్లు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడుపుతోంది. కొందరు ప్రైవేట్ కండక్టర్లు ఆర్టీసీ సొమ్మును తమ జేబుల్లోకి వేసుకుంటున్నారు.
టికెట్లు ఇవ్వకపోడంతో.. బస్సులో ఎంత మంది ప్రయాణించారో తెలుసుకోవడానికి కూడా వీల్లేకుండా పోతోంది. దీంతో కొందరు తాత్కాలిక కండక్టర్లు కాసులకు కక్కుర్తిపడి.. కొంత సొమ్మును తమ జేబుల్లో వేసుకొని.. మిగతా డబ్బును ఆర్టీసీకి అప్పగిస్తున్నారు. దీంతో అటు ప్రయాణికులు, ఇటు ఆర్టీసీ నష్టపోవాల్సి వస్తోంది. ఇదే సమయంలో కొందరు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు.. తమకు రోజుకు ఇస్తామని చెప్పిన మొత్తంలో సగమే ఇస్తున్నారని వాపోతున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
