Telangana: రోడ్డుపై వెళ్తుండగా ఆటోడ్రైవర్కు కనిపించిన చిన్న బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా..

నిర్మల్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు. రోడ్డుపై దొరికిన రూ.16 లక్షల బంగారం, నగదు, గుర్తింపు పత్రాలు ఉన్న సంచిని యజమానికి క్షేమంగా అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ..
తెలంగాణలోని కడెం ప్రాంతానికి చెందిన సుజాత నిర్మల్లో ఆరోగ్యమిత్రగా పనిచేస్తోంది. శనివారం సాయంత్రం ఆమె కుమారుడితో కలిసి బైక్పై ఖానాపూర్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో కుమార్తె పెళ్లి కోసం చేయించిన 16 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు, గుర్తింపు పత్రాలు ఉన్న సంచిని వాహనానికి కట్టారు. అయితే కొండాపూర్ బైపాస్ వద్ద ఆ సంచి కిందపడటాన్ని వారు గుర్తించలేదు.
తర్వాత బంగారం పోయిందని సోషల్ మీడియాలో వచ్చిన సందేశాన్ని చూసిన సౌజన్య తన భర్త ద్వారా సాయికుమార్కి సమాచారం అందించింది. ఆదివారం సుజాతకు సమాచారం చేరగానే.. ఆమె వచ్చి తన బంగారం, నగదు, పత్రాలను తిరిగి తీసుకుంది. ఆటో డ్రైవర్ సాయికుమార్ నిజాయతీని మెచ్చుకున్న గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
