దుబాయ్ వెళ్లి మోసపోయిన మెదక్ వ్యక్తి.. 13 ఏళ్లుగా అక్కడే భిక్షాటన! ఆ తర్వాత..

కుటుంబానికి ఆసరాగా ఉందామని ఓ వ్యక్తి దేశం కాని దేశం వెళ్లాడు. అయితే అలా వెళ్లిన వాడు 13 ఏళ్లు గడుస్తున్నా.. సొంతూరిలోని అయినవారికి ఒక్కసారి కూడా మళ్లీ కనిపించలేదు. కనీసం ఫోన్ కూడా లేదు. నకిలీ ఏజెంట్ల వల్లోపడి మోసపోయి 13 ఏళ్లు అక్కడే రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ జీవించాడు..
మెదక్, ఆగస్ట్ 30: పేదరికం అతడిని ఊరొదిలి పొమ్మంది. కుటుంబానికి ఆసరాగా ఉందామని అతడు కూడా తలొంచి.. దేశం కాని దేశం వెళ్లాడు. అయితే అలా వెళ్లిన వాడు 13 ఏళ్లు గడుస్తున్నా.. సొంతూరిలోని అయినవారికి ఒక్కసారి కూడా మళ్లీ కనిపించలేదు. కనీసం ఫోన్ కూడా లేదు. నకిలీ ఏజెంట్ల వల్లోపడి మోసపోయి 13 ఏళ్లు అక్కడే రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ జీవించాడు. ఇటీవల ఓ వ్యక్తి సాయంతో తిరిగి సొంత గూటికి చేరాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన కోనింటి కృష్ణ ఉదంతం ఇదీ..
ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన కోనింటి కృష్ణ కూలిపనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకునే వాడు. కృష్ణకు భార్య లక్ష్మి, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. 13 ఏళ్ల క్రితం అప్పు చేసి ఓ నకిలీ ఏజెంట్ ఉచ్చుతో చిక్కుకుని దుబాయ్లో పని చేయడానికి వెళ్లాడు. అయితే అక్కడ కొన్నిరోజులకే ఉద్యోగం ఇచ్చిన పరిశ్రమ నిర్వాహకుల అసలు రంగు తెలిసింది. రోజుకో రకంగా ఇబ్బందులు గురి చేయసాగారు. దీంతో అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి దుబాయ్ వీధుల్లోనే భిక్షాటన చేస్తూ కడుపు నింపుకోసాడు. ఎవరినైనా సహాయం కోరుదామంటే అక్కడి వారి భాష కృష్ణకు తెలియదు. దీంతో సొంతూరిలోని కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వలేకపోయాడు. దేశం కాని దేశంలో ఉద్యోగం కోసం వెళ్లిన భర్త ఏమైయ్యాడో తెలియని లక్ష్మి కూలి పనులు చేసుకుంటూనే పిల్లలిద్దరినీ పెద్ద చేసింది. తాజాగా కుమార్తెకు పెళ్లి కూడా చేసింది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం భర్త కృష్ణ ఆచూకీపై ఆమెకు సమాచారం అందడంతో సంతోషానికి అవధులు లేకుండా పోయింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
