Viral: చేపల కోసం వేసిన వల బరువెక్కినట్టుగా అనిపించింది.. గంపెడు ఆశతో పైకి లాగి చూడగా

చేపల కోసం వేసిన వల ఒక్కసారిగా బరువెక్కింది. దెబ్బకు సంతోషంలో మునిగిపోయారు జాలర్లు.. భలేగా భారీ చేపలు పడి ఉంటాయిలే అనుకునేరు.. ఆ వలను పైకి లాగి చూడగా షాక్ అయ్యారు.. ఇంతకీ ఆ వివరాలు.. ఓసారి స్టోరీపై లుక్కేయండి మరి.
ఒడిశా-పశ్చిమ బెంగాల్ సరిహద్దు వెంబడి దిఘా సమీపంలో ఓ జాలరికి భారీగా చేపలు చిక్కాయి. ఆదివారం ఉదయం ఆ ప్రాంతంలో చేపలు పట్టేందుకు ఓ మత్స్యకారుడు వెళ్లగా.. అతడి వలలో 90 భారీ ‘టెలియా భోలా’ చేపలు పడ్డాయి. చిక్కిన ఒక్కో చేప 30 నుంచి 35 కిలోగ్రాముల బరువు ఉంటుందని.. మొత్తంగా ఆ చేపలు వేలంలో దాదాపుగా రూ. కోటికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. దిఘా చేపల మార్కెట్ వద్ద ఈ అరుదైన టెలియా భోలా చేపలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కోల్కతాకు చెందిన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈ అరుదైన 90 చేపలను కొనుగోలు చేసింది. వాటిల్లో ఉండే అధిక ఔషధ గుణాలు కారణంగా సదరు కంపెనీ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. టెలియా భోలా చేప నూనె, ఇతర శరీర భాగాలు ప్రాణాలను రక్షించే మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ జాతి చేపలను విదేశాలకు కూడా ఎక్కువగానే ఎగుమతి చేస్తారు.
టెలియా భోలా సాధారణంగా లోతైన సముద్రపు నీటిలో కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ చేపల విలువ దాని పరిమాణం, బరువు ఆధారంగా నిర్ణయిస్తారట. గత సంవత్సరం, దాదాపు 1.99 క్వింటాళ్ల బరువున్న తొమ్మిది అరుదైన చేపలు ఇదే ప్రాంతంలో లభించగా.. వాటిని దాదాపు రూ.15 లక్షలకు అమ్మారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
