అయ్యో దేవుడా.. చిన్నారిని పొలం దగ్గరకు తీసుకెళ్లిన దంపతులు.. బావి దగ్గర ఆడుకుంటూ..

well

బోసి నవ్వులు.. తప్పటడుగులతో ఇంట్లో సందడి చేసే చిన్నారి.. అకస్మాత్తుగా వ్యవసాయ బావిలో పడి మరణించాడు.. ఆడుకుంటూ వెళ్లి.. ప్రమాదవశాత్తూ బావిలో పడి కానరాని లోకాలకు వెళ్లాడు.. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో చోటు చేసుకుంది.

బోసి నవ్వులు.. తప్పటడుగులతో ఇంట్లో సందడి చేసే చిన్నారి.. అకస్మాత్తుగా వ్యవసాయ బావిలో పడి మరణించాడు.. ఆడుకుంటూ వెళ్లి.. ప్రమాదవశాత్తూ బావిలో పడి కానరాని లోకాలకు వెళ్లాడు.. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చీరాల కావ్య వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కౌశిక్ నంద్ 18 నెలల బాలుడిని ఎత్తుకొని ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. బాలుడిని వ్యవసాయ బావి వద్ద కూర్చోబెట్టి పొలానికి పంపు సెట్టును ఆన్ చేశాడు.. అనంతరం పొలంలో కొద్ది దూరం వెళ్లాడు.. ఈ క్రమంలోనే.. అక్కడ ఆడుకుంటున్న బాలుడు.. బావి ఒడ్డుకు వెళ్లాడు.. అనంతరం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయాడు..

బాలుడు వ్యవసాయ బావిలో పడటాన్ని గమనించి తల్లి గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అయితే.. వ్యవసాయ బావిలో నీరు నిండుగా ఉండడంతో బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు.. దీంతో బాలుడి మృతదేహాన్ని వెలికి తీసేందుకు పంపుసెట్ల ద్వారా నీటిని తోడారు.. అనంతరం మృతదేహాన్ని బయటకు తీశారు.

చిన్నపాటి నిర్లక్ష్యంతో బాబు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని.. వివరాలు సేకరించారు.. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం కోసం హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights