AP Journalist: ఆంధ్ర జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు..మరో మూడు నెలల పొడగింపు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వం శుభవార్త. రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలోని మీడియా ప్రతినిధులకు ఉన్న అక్రిడేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు లేదా కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అయ్యే వరకు (ఏది ముందుగా జరిగితే) గడువు పొడిగింపు అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.
కొత్త అక్రిడేషన్ ప్రక్రియపై స్పష్టత
మీడియా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో గుర్తించబడుతుందన్న నేపథ్యంలో, జర్నలిస్టుల అవసరాలను అర్థం చేసుకొని ప్రభుత్వం ముందడుగు వేసిన తీరు అభినందనీయం. హిమాన్షు శుక్ల ప్రకటనలో పేర్కొన్నట్లు, మీడియా ప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అది ఈ తాజా నిర్ణయం ద్వారా స్పష్టమవుతోందని ఆయన అన్నారు. మీడియా హక్కులను రక్షిస్తూ, వారికి మద్దతుగా ఉండటమే ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించారు. ఇక కొత్త అక్రిడేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభించనుండగా సంబంధిత మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
జర్నలిస్టులకు భరోసా కలిగించే చర్య
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అనేకమంది విలేఖరులకు, కెమెరామెన్లకు, మీడియా స్టాఫ్కు ఊరటనిచ్చే వార్తగా నిలిచింది. పత్రికా రంగాన్ని గుర్తించి, ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య జర్నలిస్టుల హక్కులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు పేర్కొన్నారు. కొత్త కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియలో అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
