హైదరాబాద్ లో బోనాలు

హైదరాబాద్ : కరోనా కేసులు విజృంభణ దృష్ట్యా ఈ విడత రాష్ట్రంలో బోనాల పండుగ నిర్వహించడం లేదని దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు.
ఈ నెల 25న గోల్కొండలో ప్రారంభమైన బోనాలు జూలై 12న సికింద్రాబాద్, 19వ తేదీన హైదరాబాద్ లో బోనాలు నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత దేవాలయాల పూజారులే అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారన్నారు.
శుక్రవారం హైదరాబాద్లోని అరణ్యభవన్లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గుడులు తెరవడానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (ఎస్ఓపీ)పై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 8 వ తేదీ నుంచి గుడుల్లో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
క్యూలైన్లలో ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని , సోడియం హైపోక్లోరైడ్తో గుడి ఆవరణ కడగాలని కోరారు. గుడుల ప్రవేశం లోనే శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని , థర్మల్ స్క్రీనింగ్కు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో గుడులు మూసివేసి ఉంటాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
