శానిటైజర్‌ పితామహుడు సెమ్మెల్‌వీస్

WhatsApp Image 2020-04-13 at 8.54.40 AM

కరోనా భయంతో ఇప్పుడు ప్రపంచమంతా సబ్బులు, శానిటైజర్లతో చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నారు. అయితే… సూక్ష్మక్రిములను చంపడానికి శానిటైజర్‌ వాడాలని మొదట చెప్పింది ఎవరో తెలుసా?.. ఆస్ట్రియాలోని వియన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన(1946లో) ఇగ్నజ్‌ ఫిలిప్‌ సెమ్మెల్‌వీస్‌ అనే డాక్టర్‌![the_ad id=”4846″]

వియన్నా ఆసుపత్రిలో రెండు ప్రసూతి వార్డులుండేవి. ఒక దాంట్లో పురుష వైద్యులు, వైద్య విద్యార్థులు, మరో వార్డులో నర్సులు, ఆయాలు సేవలు అందించేవారు. ఆసుపత్రిలో ప్రసూతి సమయంలో చాలామంది గర్భిణులు మరణించేవారు. వారిని రక్షించాలనే పట్టుదలతో సంబంధిత కారణాలపై డాక్టర్‌ ఇగ్నజ్‌ అన్వేషించారు.

పురుష వైద్యులున్న వార్డులో మరణాల సంఖ్య ఎక్కువగా, నర్సులున్న వార్డులో తక్కువగా ఉండటాన్ని గమనించారు. దీనిపై మరింత లోతుగా పరిశోధించగా మరో భయంకరమైన విషయం వెల్లడైంది. పురుష వైద్యులు ఆసుపత్రిని ఆనుకునే ఉండే శవాగారంలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసేవారు.[the_ad id=”4846″]

అప్పుడు వారి చేతులకు రక్తపు మరకలు, ఇతర సూక్ష్మజీవులు అంటుకునేవి. వైద్యులు నేరుగా ప్రసూతి వార్డులోకి వచ్చి పురుడు పోస్తుండటంతో సూక్ష్మజీవుల కారణంగా గర్భిణులకు ఇన్‌ఫెక్షన్‌ అవుతూ మృతి చెందేవారు. మరో వార్డులోని నర్సులు పోస్టుమార్టం, ఆపరేషన్లు లాంటివి చేయరు.

దాంతో అక్కడ గర్భిణులకు ఇన్‌ఫెక్షన్‌ బెడద తప్పి, మరణాల సంఖ్య చాలా స్వల్పంగా ఉండేది. విషయాన్ని నిర్ధారించుకున్న ఇగ్నజ్‌ ఆసుపత్రుల్లో పరిశుభ్రతకు నాంది పలికారు. ఆపరేషన్‌ చేసేముందు వైద్యులు చేతులను క్లోరిన్‌ ద్రావణంతో శుభ్రంగా కడగాలని నిబంధన పెట్టారు.

పక్కాగా అమలయ్యేలా చూడటంతో ఆసుపత్రిలో మరణాలు క్రమంగా తగ్గుతూ రెండేళ్లలో పూర్తిగా కనుమరుగయ్యాయి. ఆయన చేసిన కృషి కాలకమ్రంలో ప్రజలకు చేరింది. శానిటైజర్ల వాడకం పెరిగింది[the_ad id=”4846″]

ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights