March 31, 2026

జయలలిత ఆస్తిపై GHMC కఠిన చర్య.. భవనం సీజ్

jayalalitha_logo

హైదరాబాద్‌లో దివంగత మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన భవనాన్ని అధికారులు సీజ్ చేశారు. Greater Hyderabad Municipal Corporation (GHMC) ఈ చర్యను ఆస్తి పన్ను బకాయిల కారణంగా చేపట్టింది.

నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ భవనానికి 2017 సంవత్సరం నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదని అధికారులు వెల్లడించారు. యూసఫ్‌గూడా సర్కిల్ పరిధిలోకి వచ్చే ఈ ఆస్తిపై పెద్ద మొత్తంలో పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

బకాయిల వసూళ్లలో భాగంగా పన్నులు చెల్లించని భవనాలపై చర్యలు తీసుకుంటున్నామని GHMC అధికారులు తెలిపారు. ఈ క్రమంలో జయలలిత పేరుతో నమోదు చేసిన జీ+4 భవనాన్ని సీజ్ చేసి, నోటీసులు అంటించారు.

ప్రస్తుతం ఈ భవనం సీజ్ ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. నగరంలో పన్నులు చెల్లించని ఆస్తులపై ఇలాంటి చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading